TirumalaHills
TirumalaHills

Social Icons

Pages

  • Free Rs.300 Tickets
  • Photo Competition
  • TTD Calendar
  • TTD Panchangam
  • Privacy Policy
  • Contact Us
ॐ Welcome to TirumalaHills | Om Namo Venkatesaya | Govinda Govinda Govinda ॐ

Ads

Main Menu

  • Home
  • Tirumala History
    • Tirumala History
    • Darshan
    • Seva
    • Brahmotsavam
    • Accommodation at Tirumala
    • Accommodation at Tirupati
    • Transportation
    • Free Meals / Anna Prasadam
    • Walking up the Hills
    • Kalyana Katta / Tonsuring
    • Medical Services
    • Tulabharam
    • Niluvudopidi
    • Anga Pradakshinam
  • Booking Services
    • Special Entry Darshan (Rs.300)
    • Free Sarva Darshanam
    • Seva at Tirumala
    • Seva at Tiruchanoor
    • Virtual Seva at Tirumala
    • Virtual Seva at Tiruchanoor
    • Accommodation at Tirumala
    • Accommodation at Tirupati
    • Hundi @ Tirumala
    • Hundi @ Tiruchanoor
    • Srivani Trust Donations
    • Other Trust Donations
    • Cottage Donations
  • Festivals
    • Srivari Jyeshtabhishekam
    • Srivari Annual Salakatla Brahmotsavam
    • Srivari Annual Brahmotsavam
    • Srivari Navaratri Brahmotsavam
    • Srivari Annual Pavithrotsavam
  • Visiting Places
    • Srivari Pushkarini
    • Sri Bhu Varaha Swamy Temple
    • Kapila Theertham
    • Deer Park Reserve
    • Srivaari Paadamulu
    • Tirumala Museum
    • Silathoranam
    • Papavinasam Theertham
    • Srivari Mettu
    • Alipiri
    • Srinivasa Mangapuram
    • Tiruchanur – Alamelu Mangapuram
    • Matrusri Tarigonda Vengamamba
    • Kanipakam
    • Devuni Kadapa - Kadapa
  • Must Read
    • Most Popular Places
      • Ujjain Mahakaleshwar Jyotirlinga
      • Mahalakshmi Temple, Kolhapur
      • Sri Kanchi Kamakshi Amman Temple
      • Temple in Bhadrachalam
      • Maha Shivaratri
      • Srikalahasti Temple
      • VARANASI – Benares, Banaras or Kāśī
    • Popular Stotrams
      • SECRET HANUMAN RAKSHA MANTRA
      • SHIVA SAHASRA NAMA STOTRAM
      • SRI RUDRAM CHAMAKAM
      • SRI RUDRAM NAMAKAM
      • BILVAASHTAKAM
      • LINGASHTAKAM
      • SHIVASHTAKAM
      • SRI RUDRAM LAGHUNYASAM
      • SRI VENKATESWARA GOVINDA NAMALU
    • Route Map
    • Today Telugu Panchangam
    • Indian Festivals
    • Top Secret Facts of Lord Venkateswara
    • 300 Year Old Tirumala Laddu
    • Sri Venkateswara Suprabhatam
    • Sri Venkateswara Stotram
    • Sri Venkateswara Prapatti
    • Sri Venkatesha Mangalaasaasanam
    • Venkateswara Ashtottara Sata Namavali
    • Govinda Namaavali
    • Sri Srinivasa Gadyam
    • Sri Venkateswara Vajra Kavacha Stotram
  • Keerthanalu
    • Sri Tallapaka Annamacharya
    • Annamayya Keerthanas Part-1
      • Kattedura Vaikuntham
      • Musina Mutyalakele
      • Tiruveedhula Merasi
      • Vinaro Bhagyamu
      • Narayanathe Namo Namo
      • Anni Mantramulu
      • Chandamama Raavo
      • Indariki Abhayambu
      • Adivo Alladivo
      • Tandanana Ahi
      • Manujudai Putti
      • Ekkuva Kulajudaina
      • Kondalalo Nelakonna
      • Shodasa Kalanidhiki
      • Jo Achyutananda
      • Jagadapu Chanuvula
      • Enta Matramuna
      • Brahma Kadigina Padamu
      • Nanati Bathuku
      • Bhavayami Gopalabalam
    • Annamayya Keerthanas Part-2
      • Alara Chanchalamaina
      • Alarulu Kuriyaga
      • Ammamma Emamma
      • Andariki Aadhaaramaina
      • Antaryami Alasiti
      • Ati Dushtuda Ne Nalusudanu
      • Bhaavamu Lona
      • Chaaladaa Brahmamidi
      • Chaaladaa Hari Naama
      • Chaduvulone Harina
      • Chakkani Talliki
      • Cheri Yasodaku
      • Choodaramma Satulaaraa
      • Daachuko Nee Paadaalaku
      • Dasaratha Raamaa
      • Deva Devam Bhaje
      • Deva Ee Tagavu Teerchavayyaa
      • Dolaayaanchala
      • E Puraanamula Nenta Vedikinaa
      • Ee Suralu Ee Munulu
      • Ele Ele Maradalaa

Tarigonda Vengamamba

Post a Comment Sunday, June 19, 2022

 



🙏 తరిగొండ వెంగమాంబ 🙏


💫 శ్రీవారి దర్శనం ముగించుకోగానే, మనం సాధారణంగా, మాడవీధుల ప్రక్కనే ఉన్న తరిగొండ వెంగమాంబ సత్రం లో ఉచిత భోజనం చేసి, అదే శ్రీవారి మహాప్రసాదంగా భావిస్తాము. ప్రతిరోజూ సుమారు లక్ష మందికి, అదే బ్రహ్మోత్సవాల్లో రెండు లక్షల మందికి, వండి వడ్డించే, "నభూతో నభవిష్యతి" అన్న చందంగా ఉండే ఈ భోజనశాలకు ఆ భక్తురాలి పేరెందుకు పెట్టారు?


💫 తిరుమలేశుడు ప్రతిరాత్రీ ఏకాంతసేవ తరువాత, ఓ భక్తురాలి ఇంటికి వెళ్ళి, ఆమె భక్తి పారవశ్యంతో తనను కీర్తిస్తుంటే, తాను నాట్యం చేస్తుండేవాడు. ఆమె చెప్పే ముచ్చట్లు ఆసక్తిగా వింటుండేవాడు. ఆమెకు అవమానం జరిగితే, తనకు జరిగినట్లుగానే భావించేవాడు. ఈ లీలలన్నీ పూర్వయుగాల నాటివో, వేల ఏళ్ళ నాటివో కాదు; కేవలం రెండు వందల యాభై ఏళ్ళ క్రితం జరిగిన యథార్థ సంఘటనలు!


💫 ఆ మహాభక్తురాలే పరమ పూజ్యురాలైన తరిగొండ వెంగమాంబ గారు.


💫 మహా మహిమాన్వితురాలు వెంగమాంబ ప్రస్తావన లేకపోతే శ్రీనివాసుని ఐతిహ్యం అసంపూర్తిగానే మిగిలి పోతుందంటే, అతిశయోక్తి కాదు.



🌈 వెంగమాంబ బాల్యం 🌈


💫 తిరుపతి నుండి మదనపల్లె వెళ్ళే మార్గంలో, నేడు "వాయల్పాడు" గా పిలువబడే "వాల్మీకపురం" అనే పట్టణానికి నాలుగు మైళ్ళ దూరంలో "తరిగొండ" అనే గ్రామం నేటికీ ఉంది. ఆ గ్రామంలో, కానాల కృష్ణయ్య-మంగమ్మ అనే దంపతులకు ఐదుగురు కొడుకుల తరువాత, శ్రీనివాసుని కటాక్షంతో జన్మించిన ఆడపిల్లకు ఆమె తల్లిదండ్రులు "వెంకమ్మ" అని స్వామివారి పేరు పెట్టారు. ఆమె అతి చిన్నతనం నుండీ భజనలూ, ఉపవాసాలతో గంటలకొద్దీ ధ్యానంలో మునిగి ఉండడంతో, తల్లిదండ్రులు మొదట్లో ముచ్చట పడ్డారు. అయితే, రోజులు గడిచే కొద్దీ, పెళ్ళి కావలసిన పిల్ల ఇలా పనిపాటలు మానేసి ఎడతెరిపి లేకుండా పూజా పునస్కారాలలో మునిగి ఉండటం వారికి ఆందోళన కలిగించింది. ఆ చింతతోనే వెంకమ్మకు పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించారు. వెంకమ్మ మాత్రం.....  "వేంకటేశ్వరుడే నా భర్త. నాకు వివాహ ప్రయత్నాలు విరమించండి." అని వేడుకొంటూ ఉండేది. అమె మొరను పెడచెవిని పెట్టిన తల్లిదండ్రులు సమీప గ్రామానికి చెందిన వెంకటాచలపతి అనే యువకుడితో ఆమెకు అతి చిన్నతనం లోనే బలవంతంగా వివాహం జరిపించారు. కానీ, వేంకటేశ్వరుని తలంపు వేరే విధంగా ఉండడంతో, వెంకమ్మ కాపురానికి వెళ్ళక ముందే భర్త మరణించాడు. ఇవేమీ పట్టించుకోని వెంకమ్మ మాత్రం శ్రీనివాసుణ్ణే తన భర్తగా తలుస్తూ, కొలుస్తూ, పసుపు కుంకుమలు సిగారించుకొని, సమీపంలోనే ఉన్న ఆలయం లోని ఆంజనేయస్వామికి, నారసింహునికి హారతులిచ్చేది. తరిగొండ గ్రామంలో ఈ ఆలయాన్ని నేడూ చూసి తరించవచ్చు.



🌈 వెంగమాంబగా మారిన వెంకమ్మ 🌈


💫 కూతురి వ్యవహారంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో తండ్రి కృష్ణయ్య, వెంకమ్మకు, మదనపల్లి వాస్తవ్యులైన సుబ్రహ్మణ్యశాస్త్రి అనే ఆధ్యాత్మికవేత్తతో ఉపదేశం చేయించాడు. అసలే మహాభక్తురాలైన వెంకమ్మ, ఆ ఉపదేశ మహిమతో మహాతపస్వినిగా మారిపోయింది. ఆమె నోటినుండి; వేంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ అనేక శ్లోకాలు, శతకాలు ఆశువుగా వెలువడుతుండేవి. ఇరుగు పొరుగు వారందరూ అప్పటినుండి ఆమెను ఓ మహాయోగినిగా భావించి, 'వెంగమాంబ"  అంటూ, గౌరవ మర్యాదలతో సంబోధించేవారు.


🌈 పీఠాధిపతుల ఆగమనం 🌈


💫 అయితే, వితంతువులను చిన్నచూపు చూసే ఆ రోజుల్లో భర్తను కోల్పోయిన ఓ మహిళ, సౌభాగ్యవతి వలె ఆలయాన్ని సందర్శించడం కొందరు సాంప్రదాయ వాదులకు కంటగింపైంది. ఆమెను ఎలాగైనా ఇంటికే పరిమితం చేయాలని భావించారు. అదే సమయంలో తన ఆధ్యాత్మిక పర్యటనలలో భాగంగా ఆ గ్రామానికి వేంచేసిన పుష్పగిరి పీఠాధిపతుల వారికి, గిట్టనివారు కొందరు వెంగమాంబ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని స్వాములవారు వెంగమాంబతో ప్రస్తావించగా, ఆమె తన భర్త వేంకటనాథుడని, ఆయనకు మరణం లేదని, తాను నిత్య సౌభాగ్యవతినని ఖరాఖండిగా సమాధాన మిచ్చింది. ఆమె మాటలకు అవాక్కయిన పీఠాధిపతుల వారు ఆమెను ఏమార్చలనే ఉద్దేశ్యంతో, తానో పీఠానికి అధిపతిననీ, తనకు నమస్కరించాలని తెలియదా? అంటూ వెంగమాంబను ప్రశ్నించారు. అంతట వెంగమాంబ,  "స్వామీ! నేను నమస్కరిస్తాను. ఒక్కసారి తాము ఆసీనులై ఉన్న పీఠం మీద నుండి లేవండి" అని ప్రార్థించటంతో స్వామివారు పీఠం మీద నుండి పైకి లేచారు. ఆమె నమస్కరించగానే, హఠాత్తుగా పీఠం అగ్నికి ఆహుతై పోయి, పీఠాధిపతుల వారికి తృటిలో ఘోరప్రమాదం తప్పింది. అచ్చెరువొందిన స్వామివారు, ఆమె మహా తపస్సంపన్నురాలనీ, దైవకృప సంపూర్ణంగా కలిగిన మహిళామూర్తి అనీ, ఆమె ఆలయంలో ప్రవేశించడానికి ఏ విధమైన అభ్యంతరం పెట్టవద్దని గ్రామస్తులకు నచ్చజెప్పారు. ఆ ఉదంతంతో వెంగమాంబ మరింత ప్రసిద్ధురాలైంది.



🌈 తిరుమలకు పయనం 🌈


💫 అయినా కొందరు ఆమెనూ, ఆమె కుటుంబాన్ని ఇంకా వేధిస్తూనే ఉన్నారు. ఇవేమీ పట్టించుకోని వెంగమాంబ ఆ వూళ్ళోనే ఉన్న నృసింహస్వామినీ, ఆంజనేయుణ్ణి పూజించడం కొనసాగించింది. ఒకనాడు ఆ దేవాలయం లోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ధ్యానం చేసుకుంటున్న వెంగమాంబను కొందరు ఛాందసవాదులు "ఏ క్షేత్రానికో వెళ్ళి తపస్సు చేసుకోకండా, ఈ గుళ్ళో ఎందుకు దాపురించావు?" అని దూషిస్తూ, ఆమెను జుట్టు పట్టుకుని ఆలయం నుండి బరబరా బయటకు ఈడ్చివేశారు. వారి మాటలను భగవత్సంకల్పంగా భావించిన వెంగమాంబ వేరే ఆలోచన లేకుండా, అరణ్యమార్గం పట్టి హుటాహుటిన తిరుమల క్షేత్రం చేరుకుంది.



🌈 క్షేత్ర సందర్శన 🌈


🌈 తిరుమల క్షేత్రాన్ని తొలిసారిగా సందర్శించు కొన్నపుడు, ఆనందపారవశ్యంలో అలవోకగా ఆమె నోటినుండి జాలువారిన ముత్యాల మూటలు "శ్రీ వేంకటాచల మహాత్మ్యం" లో ఈ విధంగా పొందు పరచబడి ఉన్నాయి.



ఘనగోపురములు, ప్రాకారమంటపములు 

తేరులు, సత్పుణ్యతీర్థములును 

ముద్దుగా బల్కు శుక, పికములును నీలి

కంఠములును తులసికాదళ సుమములు

క్రిక్కిరిసియుండు వేంకటగిరి పురమున


💫 కొద్ది మార్పులు, చేర్పులతో తిరుమల క్షేత్రం నేటికీ అదే విధమైన ముగ్ధమనోహర ప్రాకృతిక సౌందర్యంతో భక్తజనులను అలరిస్తోంది.



🌈 వెంగమాంబకు నిలువనీడ 🌈


🌈 వెంగమాంబ ప్రతిరోజూ శ్రీనివాసుణ్ణి దర్శించి, సేవించి; ఆశువుగా వచ్చే పద్యాలతో, శతకాలతో భక్తి పరవశురాలై వేంకటేశుణ్ణి స్తుతించేది. ఆమె భక్తికి ఎందరో తన్మయులయ్యే వారు. ఆమెను ఎంతగానో కొనియాడేవారే తప్ప, నిలువనీడ లేక గుడిలోనే తలదాచుకుంటున్న ఆమె దీనావస్థను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. తనకో నీడ కల్పించమని ఆనందనిలయుణ్ణీ, ఆయనకూ సిఫారసు చేయమని అమ్మవారినీ ఆమె పరిపరి విధాలా వేర్కొనగా ఎట్టకేలకు శ్రీనివాసుడు కరుణించాడు. 


💫 స్వామివారి ప్రేరణతో, వారి ఆంతరంగిక భక్తుడైన హాథీరాంబావాజీ వారి శిష్యులు, మహంతుమఠానికి ఆనాటి అధిపతి అయిన ఆత్మారాందాసు సుమారు 1750వ సం. లో వెంగమాంబకు తగిన నివాసాన్ని ఏర్పరచడానికి, సంకల్పించారు 


👉 (హాథీరాం బావాజీ గురించీ, దేవాలయ పరిపాలనా కార్యకలాపాలను సుదీర్ఘకాలం నిర్వహించిన మహంతుమఠం గూర్చి మరో ప్రకరణంలో వివరించబడింది).👈


💫 భగవత్ప్రేరణతో ఆత్మారాందాసు గారు శ్రీవారి మందిరానికి తూర్పు మాడవీధి చివరన, ఈశాన్యమూలలో, శ్రీవారి రాతిరథానికి ప్రక్కగా ఓ పూరి గుడిశెను నిర్మించి, వెంగమాంబ వద్దకు వెళ్ళి, ఆ గుడిశెను ఆమె నివాసనిమిత్తం స్వీకరించాల్సిందిగా అర్థించాడు. అంతే గాకుండా, "వకుళమాత" పేరుతో ఒక పడి బియ్యాన్ని, ఇతర వంటవస్తువులనూ వెంగమాంబ నివాసానికి నిత్యం పంపేటట్లుగా తీర్మానించాడు. మహంతు ఏర్పాటు చేసిన కట్టడి ననుసరించి ఆలయాధికారులు వెంగమాంబకు కావలసిన సంభారాల్ని ఆలయ ఉగ్రాణం (సరుకుల గిడ్డంగి) నుంచి వెంగమాంబ ఇంటికి పంపేవారు.




🌈 స్వామివారికి తులసీ కైంకర్యం 🌈


💫 ఇలా ఆవాసం మరియు ఆహారం విషయాల్లో నిశ్చింత అయిన వెంగమాంబకు; కళ్ళు తెరిచినా, మూసినా ఆ సప్తగిరీశుడే సాక్షాత్కరించేవాడు. శ్రీనివాసుడు ఆమె పాటకు పదం కలుపుతూ, ఆమె ముచ్చట్లను మైమరచి వినేవాడు. భక్తిపారవశ్యంలో ఆసాంతం మునిగిన వెంగమాంబ అలంకారప్రియుడైన శ్రీనివాసునికి ప్రతిరోజూ పూమాలలు సమర్పించాలనీ, ప్రతి సాయంత్రం చివరగా కర్పూరహారతితో నీరాజనం సమర్పించాలని కలలు గనేది. అంతేగాకుండా, తులసీ ప్రియుడైన తిరుమలేశుని కోసం తన కుటీరం వెనుక తులసివనాన్ని ఏర్పాటు చేయదలిచి, ఒక దిగుడుబావిని త్రవ్వించింది. బావి అడుగున ఓ పెద్ద బండరాయి తగలగా వెంగమాంబ గంగమ్మను ప్రార్థించడంతో, బండ చిట్లి జలధార వెల్లువలా ఉబికి వచ్చింది. ఆ వనం నుండి ప్రతిరోజూ తులసీ దళాలు తెచ్చి, మాలలు కట్టి శ్రీవారికి కైంకర్యం చేసేది.


💫 ఆనాడు వెంగమాంబ త్రవ్వించిన దిగుడుబావిని పాపవినాశనంకు వెళ్ళే దారిలో, ఏనుగుశాల వద్ద "అమ్మోరిబావి" అనే పేరుతో నేడూ చూడవచ్చు. ఇందులోని నీళ్ళను ఈనాడు కూడా తి.తి.దే. వారు తోటను పెంచడానికి ఉపయోగిస్తున్నారు.


💫. ఇలా వెంగమాంబ సమర్పించిన తులసి మాలలతోనూ, కర్పూర నీరాజనంతోనూ శ్రీ వారు మరింత అందంగా, వింత వింత కాంతులు విరాజిల్లుతూ ఉండేవారు.


💫 వెంగమాంబ మరో ధ్యాస లేకుండా స్వామివారి మీద కవితలల్లుతూ, పాటలు పాడుతూ, శ్రీవారి సేవ చేసుకుంటూ కాలం గడిపేది. శ్రీవారికి అంకితభావంతో ఆమె చేసే సపర్యల వల్ల యాత్రికులకూ, తిరుమల వాసులకూ, శ్రీవారి కైంకర్యపరులకూ, వెంగమాంబ పట్ల అపరిమిత గౌరవాభిమానాలు కలిగాయి. ఆమెను సాక్షాత్తూ భగవదంశగా తలచి, ఆమె ఆశీస్సులకోసం తహతహ లాడుతుండే వారు.



🌈 తాళ్ళపాక వారి ప్రాపకం 🌈


💫 ఆ సమయంలో, స్వామివారి మరొక పరమ భక్తుడైన తాళ్ళపాక అన్నమయ్య (ఈ భక్తుని గురించి వేరే ప్రకరణంలో వివరించబడింది.) వంశీయులు వెంగమాంబ భక్తి తత్పరత గూర్చీ, ఆమె మహిమల గూర్చి విన్నారు. ఆమె కూడా తమ బ్రాహ్మణశాఖకు చెందినదే నని తెలుసుకుని ఉత్తరమాడవీధిలో, శ్రీవరాహస్వామి ఆలయానికెదురుగా తాము నివాసముంటున్న ఇంటిలో కొంతభాగాన్ని ఆమె నివాసార్థం ఉచితంగా ఇచ్చారు. వెంగమాంబ శ్రీనివాసునికి మరొక్కసారి కృతజ్ఞతలు ప్రకటించుకొని, తాను ఉంటున్న పూరింటిని వదిలి, తాళ్ళపాక వారింటికి చేరింది. ఆ ఇంటి వెనుక కూడా తులసివనాన్ని పెంచుతూ, శ్రీవారికి కైంకర్యం నిర్వహిస్తూండేది.



🌈 అక్కరామ దీక్షితుల అక్కసు 🌈


💫 ఆ రోజుల్లో వంశ పారంపర్యంగా ఉండే అర్చకులు మాత్రమే కాకుండా, ప్రభుత్వం తరఫున కూడా అర్చకులు నియమింపబడే వారు. అక్కరామ దీక్షితులు అనే శ్రీవారి సర్కారు అర్చకుడు వెంగమాంబ ఇంటి ప్రక్కనే మందీ మార్బలంతో నివసించేవాడు. హోదా, సంపద, పరివారజనం కారణంగా ఆయనకు గర్వమూ, అహంకారమూ తలకెక్కాయి. పైగా శ్రీవారిని స్పృశించి, వారికి సేవలు చేయగలిగే భాగ్యం గలిగిన తాను సాక్షాత్తూ భగవత్సంభూతుడే అన్న అహంభావం ఆయన మదిలో మెదిలేది. అందరూ ఆయనకు వంగి వంగి నమస్కరిస్తూంటే, శ్రీవారినే సమస్తంగా భావించే వెంగమాంబ మాత్రం తన పనిలో తాను నిమగ్నమై ఉండేది. అది అక్కరామ దీక్షితులుకు కంటగింపుగా తయారైంది. 


💫 సౌభాగ్యం కోల్పోయిన స్త్రీ రోజూ వచ్చి హారతి ఇవ్వడం ఏమిటని ఆయనకు అక్కసుగా కూడా ఉండేది. వేదవేదాంగ పారాయణుడు తానుండగా, తన ఎదుటే ఓ వితంతువు సత్కారాలు పొందటం ఏమిటి? అని ఈర్ష్యతో రగిలిపోయేవాడు. పుండు మీద కారం అద్దినట్లు తాళ్ళపాక వారు ఆమెను చేరదీసి, వారి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం వల్ల అతని అంతరంగం ఇంకా క్రోధపూరిత మయ్యింది. ఉద్యోగరీత్యా నిత్యం శ్రీవారి సమక్షంలోనున్నప్పటికీ, అరిషడ్వర్గాలపై ఆధిపత్యం సాధించనట్టి ఆ అర్చకుడు స్వామి తోడిదే లోకంగా జీవిస్తున్న వెంగమాంబను నోటికి వచ్చినట్లు దూషించేవాడు. అయినప్పటికీ అలౌకికమైన ఆధ్యాత్మిక జగత్తులో తాదాత్మ్యమై ఉన్న వెంగమాంబ పన్నెత్తు మాట కూడా అనక పోవడంతో, ఆమె సహనాన్ని అలుసుగా తీసుకున్న అర్చకుని ఆగడాలు అంతకంతకూ మితిమీరి పోయాయి. ఆయన బుద్ధి మరింత వక్రించి, ఆమె పెంచుతున్న తులసివనంలో ఎంగిలి విస్తళ్ళు వేయించేవాడు. ఆసూయా ద్వేషాలు మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తాయి కదా!!



🌈 శ్రీవారి క్రోధాగ్ని 🌈


💫 ఎంగిలివిస్తళ్ళ వల్ల శ్రీవారికి చెందాల్సిన తులసిదళాలు అపవిత్రం కావడంతో నొచ్చుకొన్న వెంగమాంబ, ఒకటికి రెండు సార్లు అర్చకుణ్ణి మృదువుగా వారించింది. అయినా ఆయన వంకరబుద్ధి మారలేదు.


💫 ఒకనాడామె పెరటిలో కూర్చొని ఆనందనిలయ శిఖరాన్ని తదేకంగా చూస్తూ, ధ్యానమగ్నలై ఉండగా; అపరాహ్ణ సమయంలో, పక్కింటిలోని అర్చకుడూ, అతని పరివారగణం, మధ్యాహ్నభోజనాలు ముగించుకొని యథాప్రకారం ఎంగిలి విస్తళ్ళు విసిరారు. అవి తులసివనం లోనూ, వెంగమాంబ మీదా పడ్డాయి. ఇన్నాళ్ళూ తనకు అర్పితమయ్యే తులసిదళాలు పెరుగుతూ ఉన్న వనంలో ఎంగిలి విస్తళ్ళు పడేస్తున్నా పట్టించుకోని శ్రీనివాసుడు ఆరోజు ఎంగిలాకులు తన భక్తురాలైన వెంగమాంబ మీద పడడంతో, అది ఆమెకు తద్వారా తనకు తీరని అవమానంగా భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆశ్రిత పక్షపాతియైన శ్రీనివాసుడు తనకెన్ని అవమానాల నైనా భరిస్తాడు గానీ, తనను నమ్మినవారినెవరైనా దూషిస్తే మాత్రం అణుమాత్రం సహించడు! దోషులను శిక్షించి గానీ వదలడు! అందుకే శ్రీవారిని శరణాగత రక్షకుడూ, ఆర్తత్రాణపరాయణుడూ అని కీర్తిస్తారు. 


💫 కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్న స్వామివారు వెంగమాంబను ఆవహించి, ఆమె నోటి ద్వారా.. "ఓరీ పాపీ! నేటితో నీ వంశం సరి. అందరూ నెత్తురు కక్కుకుని మరణిస్తారు" అని పరుషవాక్కులు పలికింపజేశాడు. ఆమె వాణిని సాకారం చేస్తూ, ప్రధానార్చకునితో సహా వారి కుటుంబ సభ్యులందరూ తక్షణమే నెత్తురు కక్కుకుని మరణించారు. అర్చకుని ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ పాదాల మీద పడి శరణు వేడాడు. అప్పుడు కొంచెం శాంతించిన వెంగమాంబ - మీ వంశంలో ఒక్కడు మాత్రం బ్రతుకుతాడని అభయమిచ్చింది. వెంగమాంబ ఇచ్చిన శాపమూ, అభయమూ నేటికీ తిరుమల యందు చెల్లుబాటులో ఉన్నాయని స్థానికులంటారు. 


💫 ఆ దైవిక ఘటన జరిగిన రోజు సాయంకాలం, వికలమనస్కురాలై ఉన్న వెంగమాంబతో శ్రీవారు జరిగిన దానికి చింతించవలదనీ, అంతా తన ప్రమేయంతోనే జరిగిందనీ, వెంగమాంబ నిమిత్త మాత్రురాలనీ, తన భక్తురాలిని నిష్కారణంగా దూషించినవారికి తగిన శాస్తి జరిగిందని చెప్పి సమాధాన పరుస్తాడు. శ్రీవారి ఓదార్పుతో కుదుట పడ్డ వెంగమాంబ ఆ దినం నుండి క్రమం తప్పకుండా, ఆలయంలో ఆనందనిలయునికి మరింత భక్తిశ్రద్ధలతో హారతినిస్తూ ఉండేది. అధికారులు అమెకే విధమైన ఆటంకాలూ కలిగించే వారు కాదు. భక్తులు కూడా, ఆమె శ్రీవారి సమక్షంలో ఉండటమే మంగళదాయకంగా భావించేవారు.




శ్రీవారికి తాత్కాలికంగా దూరమైన వెంగమాంబ... ఎందుకు!?!



🌈 శ్రీవారికి తాత్కాలికంగా దూరమైన వెంగమాంబ 🌈


💫 వెంగమాంబ కైంకర్యాలు కొనసాగుతుండడం, ఆమె భక్తుల మన్ననలందుకోవడం మరో వర్గానికి చెందిన అర్చకులకు కంటగింపైంది. ఆమెను సూటిపోటీ మాటలతో, పరుష పదజాలంతో బాధించేవారు. విసిగి వేసారిన వెంగమాంబ పరిపరి విధాలుగా ఆలోచించి, మనసు రాయి చేసుకొని, శ్రీవారి సేవకు దూరమవుతున్నానన్న బాధను అతి కష్టం మీద దిగమ్రింగుకొంటూ, ఆలయానికి వెళ్ళడం విరమించుకొంది. స్వామివారి దర్శనభాగ్యం లేకుండా జీవించడం దుర్భరమైనప్పటికీ, అర్చకుల మనస్సు నొప్పించటం ఇష్టంలేని వెంగమాంబ నిత్యహారతికి స్వస్తి చెప్పి కొంతకాలం ఇంటికే పరిమితమైంది. శ్రీవారి ఆగ్రహం అతిశయించి ప్రధానార్చకుల ఉదంతం పునరావృతం కాకూడదని ఆమె ఉద్దేశ్యం. అటు, తమ పథకం పారి వెంగమాంబ ఆలయానికి దూరమవడంతో అర్చకులు మురిసిపోయారు. అది మూణ్ణాళ్ళ ముచ్చటే అని వారికి తెలియదు.


వెంగమాంబ ఆలయానికి రాకపోవడం ఆనందనిలయునికి ఆందోళన కల్గిస్తుంది. ఆమె సమర్పణభావంతో ఇచ్చే హారతి కోసం రోజుల తరబడి ఆర్తిగా నిరీక్షించేవాడు. ఆ భక్తవత్సలుడు ఆమె గొప్పదనాన్ని లోకానికి చాటిచెప్పి, ఆమె మనసు నొప్పించిన వారికి మరోసారి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అంతే! శ్రీవారు మరో అద్భుతమైన పథకాన్ని రచించారు


🌈 ఆగిన తేరు 🌈


💫 మరునాడు బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు. శ్రీవారి తేరు దేదీప్యమానంగా వెలుగుతూ తిరుమల మాడవీధుల్లో విహరిస్తోంది. పురజనులనూ, భక్తసందోహాన్ని అనుగ్రహిస్తూ, తూర్పు, దక్షిణ, పశ్చిమ మాడవీధుల్లో నిరంతరాయంగా సాగిపోయింది. ఉత్తర మాడవీధిలో తేరు ముందుకు సాగుతూ, తరిగొండ వెంగమాంబ ఇంటి ముందు ఉన్నపళంగా ఆగిపోయింది. అర్చకులు, ఆలయాధికారులు, యాత్రికులు, తిరుమలవాసులు రథాన్ని కదల్చటానికి శతవిధాలుగా ప్రయత్నించారు. వృథా శ్రమ తప్ప, రథం ఆవగింజంతైనా కదల్లేదు. గంటలకొద్దీ కాలయాపన జరిగింది. ఈ ఆటంకాన్ని గమనించిన పెద్దలు, "ఏ భక్తునికో కష్టం కలిగి, స్వామివారి మనసు నొచ్చుకోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు" అని ఊహించుకున్నారు. వెంటనే అర్చకులకు వెంగమాంబ విషయం స్ఫురణకు వచ్చింది. ఆమెను దుర్భాషలాడడం, ఆమె ఆలయానికి దూరమవడం, ఆమె నిత్యం ఇచ్చే హారతి కొన్ని రోజులనుండి శ్రీవారికి అందకుండా పోవడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రావడంతో వారి అనుమానం దృఢమైంది. దానితో అర్చకులందరూ హుటాహుటిన వెంగమాంబ ఇంటికి వెళ్ళి, తమవల్ల జరిగిన అపరాధానికి క్షమార్పణ కోరి, స్వామివారికి తక్షణమే హారతినిచ్చి రథం కదిలేందుకు సహకరించ వలసిందిగా ప్రాథేయపడ్డారు. అర్చకుల ప్రార్థనలు విన్న వెంగమాంబ వెంటనే హారతి పళ్ళెంతో బయటకు వచ్చి, తిరుమలేశునికి నీరాజనం ఇచ్చి, నిరాటంకంగా ముందుకు సాగమని ప్రార్థించింది. తక్షణమే భక్తులందరూ ఆశ్చర్యానందాలతో మైమరచి వీక్షిస్తుండగా, రథం సునాయాసంగా ముందుకు కదిలింది.


🌈ముత్యాలహారతి 🌈


💫 ఆనాటి నుండీ ఆలయ నిర్వాహకులు మరింత భక్తి ప్రపత్తులతో, ఆమె చేత స్వామివారికి కర్పూరహారతిని

ఇప్పించేవారు.


ప్రతిరోజూ చిట్టచివరగా వెంగమాంబ కర్పూరహారతి లేనిదే ఆలయం మూయకూడదనీ, ఆమె హారతి తరువాత మరే హారతీ ఇవ్వరాదని స్వామివారు అర్చకులకూ, అధికారులకూ స్వప్నంలో కనపడి ఆదేశించారు. ఆనాటి నుండి ప్రతిరోజూ ఏకాంతసేవ సమయంలో చిట్టచివరగా వెంగమాంబ గారి ముత్యాలహారతి అయిన తరువాతనే శ్రీవారి ఆలయం మూయబడుతున్నది. ఈ ముత్యాలహారతి గురించి మనం "ఏకాంతసేవ" లో ఇంతకు ముందే తెలుసుకున్నాం. తన తదనంతరం కూడా ముత్యాలహారతి నిరాఘాటంగా కొనసాగే నిమిత్తం, నిస్సంతు అయిన వెంగమాంబ తన చెల్లెలి కూతురైన మంగమ్మను దత్తత తీసుకుంది. నేటికీ ఈమె సంతతి వారే పవళింపు సేవలో ముత్యాలహారతి నిచ్చే సాంప్రదాయాన్నీ, రంగువల్లులు తీర్చిదిద్దటాన్ని కొనసాగిస్తున్నారు


🌈 చిరిగిన శ్రీవారి వస్త్రం 🌈


💫 ఇలా కొంతకాలం గడిచాక, ఒకనాటి రాత్రి శ్రీవారు యథాప్రకారం ఏకాంతసేవ పూర్తయిన తరువాత, వెంగమాంబ ఇంటికి వెళ్ళి, ఊయలలో ఊగుతూ, ఆమె చెప్పే భాగవతం మైమరచి వింటున్నారు. ఆమె ఓ మంచి ఘట్టం చదువుతుండగా స్వామివారు తెల్లవారు ఝామున మూడు గంటలకు సుప్రభాత సేవ కోసం, ఉయ్యాల దిగి వెళ్ళిపోబోయారు. శ్రీవారి సామీప్యంలో మరికొంత సేపు ఉండాలన్న ఉబలాటంతో వెంగమాంబ స్వామివారి పంచె పట్టుకొని వారించబోగా, శ్రీవారు, "నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు. వారందర్నీ అనుగ్రహించాలి కదా!!" అంటూ, అప్పటికే సుప్రభాతసేవకు కాలాతీత మవ్వడంతో, ఒక్క ఉదుటున లేచి విసవిసా ఆనందనిలయం లోనికి వెళ్ళిపోయారు. దాంతో, శ్రీవారి పంచె సగానికి చిరిగి, ఒక ముక్క వెంగమాంబ చేతిలో చిక్కుకు పోయింది.


💫‌ సుప్రభాతానంతరం, అర్చకులు దర్శనానికెళితే, స్వామివారు సగం చిరిగిన పట్టుపంచెతో దర్శనమిచ్చారు. అర్చకులందరూ కొంచెం సేపు కంగారు పడినా, అంతలోనే తేరుకుని, అది దొంగతనం కాదనీ, ఎవరో భక్తుల ద్వారా ఇలా జరిగిందనీ, స్వామివారితో అంతటి సాన్నిహిత్యం కలిగింది వెంగమాంబే అయి ఉంటుందనీ నిర్ధారించుకున్నారు. అందరూ కలిసి వెంగమాంబ ఇంటికి వెళ్ళి ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఆమె, పూజాగృహంలో అపురూపంగా భద్రపరిచిన పట్టుపంచె చిరిగిన భాగాన్ని కళ్ళకద్దుకుంటూ, అర్చకులకు అప్పగించింది.


💫 మనం గత రెండు రోజులుగా చెప్పుకున్న అనేక మహిమాన్వితమైన సంఘటనల ద్వారా వెంగమాంబ పేరు సర్వ వ్యాపితమైంది. ఎందరెందరో సంస్థానాధీశులు, జమీందార్లు, భూస్వాములు, సామాన్యులు ఆమెకు భక్తులుగా, శిష్యులుగా మారి ఆమెకు లెక్కలేనన్ని మడి మాన్యాలను ఈనాములుగా సమర్పించారు.ఆ యావత్తు సంపదనూ ఆమె భక్తులకోసమే వెచ్చించేది. అన్నసత్రాల నిర్వహణ, చలివేంద్రాల ఏర్పాటు, బ్రహ్మోత్సవాల్లో యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు వంటివి విరివిగా చేపట్టేది. ఆకొన్నవారికి లేదనకుండా ఆమె చేసిన అన్నదాన స్ఫూర్తితోనే తి.తి.దే. వారు, నేడు ప్రపంచంలోనే 'నభూతోనభవిష్యతి' అన్న చందంగా, నిత్యాన్నదాన పథకాన్ని ఆమె పేరు మీద చేపడుతున్నారు. తూర్పు మాడవీధికి ఆనుకుని ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదకేంద్రం గురించి మనందరికీ సుపరిచితమే.


🌈 ధార్మిక కార్యక్రమాలు 🌈


💫 దాన కార్యక్రమాలతో పాటు, ధార్మిక కార్యక్రమాలు కూడా వెంగమాంబ వైభవోపేతంగా నిర్వహించేది. బాల్యంలో తన ఇష్టదైవమైన నృసింహస్వామి జయంత్యుత్సవాలను తిరుమలలో పదిరోజుల పాటు స్వయంగా జరిపించేది. అందువల్లే, నేటికీ తిరుమలలో జరిగే నృసింహోత్సవాల్లో ఉభయనాంచురులతో కూడిన మలయప్పస్వామి వారు వెంగమాంబ ఇంటికి వేంచేసి నివేదనలందుకుంటారు.


🌈 సాహిత్యసేవ 🌈


💫 ఆమె దాన-ధార్మిక కార్యకలాపాలలో పాల్గొంటూనే, అమోఘమైన సాహిత్య సాధన కూడా చేశారు. అమె రచించిన గ్రంథం ప్రతులు తయారు చేయడం కోసం, "అష్టఘంటములు" అనే పేరుతో ఎనిమిది మంది "వ్రాయసకాండ్ర" ను (అంటే, నేటి కాలంలో స్కెబ్స్ అన్నమాట) నియమించింది. వెంగమాంబ విరచిత గ్రంథ ప్రతులను అప్పటి వెంకటగిరి, శ్రీకాళహస్తి, కార్వేటినగర సంస్థానాధీశులు జ్ఞానసముపార్జనార్థం తెప్పించుకొనే వారు.


🌈 తుంబుర తీర్థానికి ప్రస్థానం 🌈


💫 అసమాన ప్రజ్ఞా ధురీణి, బహుముఖ ప్రజ్ఞాశాలిని అయిన ఆమెను దర్శిస్తే జన్మ ధన్యమౌతుందని భావించి తండోపతండాలుగా భక్తులు వెంగమాంబ వద్దకు వచ్చేవారు. ఇలా భక్తజనం క్రిక్కిరిసిపోవడం తన ఆధ్యాత్మిక సాధనకు ఆటంకమవుతోందని, దానికేదైనా మార్గాంతరం శెలవీయమని ఆ శ్రీనివాసుణ్ణి వేడుకొంది. తనలో ఐక్యం చేసుకొమ్మని కూడా ఆ పరంధాముణ్ణి ప్రార్థించింది. ఆ సమయమింకా ఆసన్నమవ్వలేదనీ, ఆమె మరికొన్నాళ్ళు ఇహలోకంలోనే ఉండాలని సూచించిన సప్తగిరీశుడు ఆమె ప్రశాంతంగా తపస్సు నాచరించుకోవడం కోసం ఆలయానికి పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న తుంబురతీర్థం అనే పవిత్రమైన, జన సందోహానికి దూరంగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాన్ని సూచించాడు. అక్కడ ఉన్న ఓ పర్వతగుహను చూపుతూ, "వెంగమాంబా! నీవు పగలంతా నిశ్చింతగా సాధన చేసుకొని, ఈ గుహలోని సొరంగ మార్గం ద్వారా, అన్యులకు కానరాకుండా, ఆనందనిలయం లోనికి వచ్చి నన్ను ఆరాధించుకో" అంటూ ఆదేశించాడు. ఆ గుహను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, ప్రత్యేక ఉత్సవ సందర్భంగా అనుమతింపబడే తుంబురతీర్థ సమీపంలో నేటికీ మనం చూడవచ్చు. తుంబుర తీర్థ ప్రాశస్త్యం గురించి మరోసారి చెప్పుకుందాం. 


🌈 మూర్ఛిల్లిన మహంతు 🌈


💫 ఆనాటి నుండీ, వెంగమాంబ, బంగారువాకిలి మూసిన తరువాత, తుంబుర తీర్థం నుండి బిలమార్గం ద్వారా వెళ్ళి ప్రతిరాత్రీ స్వామిని ఆరాధించేది. వాడిన పూలను సడలింపు చేసి, తాజాపూలతో పూజ చేసి, యథావిధిగా కర్పూరహారతి సమర్పించేది. ఇలా కొన్ని రోజులు గడచిన పిదప అర్చకులు, ప్రతిరోజూ తాము సమర్పించిన పూవులు ప్రక్కకు నెట్టబడి, తాజా పూలు స్వామి పాదాల చెంత ఉండటం గమనించారు. మూసివేసిన ద్వారాల నుండి బంగారు వాకిలి లోనికి ప్రవేశించడం మానవమాత్రుల వల్ల కాని పని. ఇదెలా సాధ్యం?


💫 ఈ రహస్యాన్ని ఛేదించటానికి ఆప్పటి మహంతు బంగారువాకిలి మూయక ముందే గర్భాలయంలోకి ప్రవేశించి ఆగంతుకుని కోసం కాపు కాశాడు. సరిగ్గా అర్థరాత్రి సమయంలో శ్రీవారి పాదాలముందు ఒక బిలం ఏర్పడగా, అందులోనుండి దివ్యకాంతులు వెదజల్లుతూ, పూజాద్రవ్యాలతో పైకి వచ్చింది వెంగమాంబ!


💫 కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ ప్రకాశాన్ని చూడలేక మహంతు మూర్ఛిల్లాడు. మరునాడు సుప్రభాత సేవానంతరం, తెప్పరిల్లిన మహంతు తాను రాత్రి చూసిన ఉదంతాన్నంతా పూసగుచ్చినట్టు విశదపరిచాడు. వెంగమాంబ తిరుమలలోనే ఉంటూ, ఆనందనిలయానికి రోజూ వచ్చి వెళుతుందని గ్రహించిన భక్తులు ఆమె కోసం వాగూ వంకా, చెట్టూ పుట్టా గాలించడం మొదలు పెట్టారు. కానీ ఆమె ఆచూకి తెలుసుకోవడం అంత సులభం కాలేదు.


🌈 కుష్టువ్యాధి నుండి ఉపశమనం పొందిన విప్రుడు 🌈


💫 ఇదిలా ఉండగా, తిరుమల క్షేత్రానికి భయంకర కుష్టువ్యాధితో బాధపడుతున్న ఓ విప్రుడు వచ్చాడు. వడలంతా పుండ్లతో, దుర్వాసన వెలువడడంతో కుటుంబ సభ్యులందరూ అతన్ని వెలివేశారు. దిక్కు తోచని స్థితిలో బ్రాహ్మణుడు శ్రీవారిని చివరిసారిగా దర్శించుకొని, వారి సన్నిధిలో ప్రాణాలు వదలాలని అత్యంత ప్రయాసకోర్చి తిరుమల క్షేత్రం చేరుకున్నాడు. కానీ అక్కడ కూడా ఆయన భక్తుల, ఆలయాధికారుల తిరస్కారానికి గురై; ఒకవైపు శరీరబాధ, మరొక వైపు ఆకలిబాధ తట్టుకోలేక పోయాడు. వాడవాడలా తిరుగుతూ, ఆత్మహత్య చేసుకోవాలనే దృఢసంకల్పంతో (అదృష్టవశాత్తూ) తుంబురతీర్థం చేరుకున్నాడు. అలవికాని బాధతో బిగ్గరగా రోదిస్తుంటే, అతని ఆక్రందన ఆ నిర్జనారణ్యంలో ప్రతిధ్వనించింది. ఆ ఆర్తనాదంతో ధ్యానభగ్నం కలిగిన వెంగమాంబ గుహలో నుండి బయటకు వచ్చి అతని దీనావస్థను గమనించింది. ఆ దీనుణ్ణి ఆదుకోవలసిందిగా ఆ ఆర్తత్రాణపరాయణుణ్ణి వేడుకొని, అతనికి తియ్యని ఫలాలను తింటానికి ఇచ్చింది. క్షుద్బాధ తీరిన ఆ విప్రునికి, శేషాచలవాసుని కృపతో అతని బాధ తీరుతుందని అభయమిచ్చింది. అయితే, తన ఉనికిని ఎవ్వరికీ తెలియపరచరాదనీ, నోరు జారితే తల వెయ్యి ప్రక్కలవుతుందని హెచ్చరించి పంపింది. వెంగమాంబ బాధోపశమన వాక్కులకు ఆనందాతిశయంతో కనులు మూసుకున్న ఆ విప్రుడు, కళ్ళు తెరిచేటప్పటికల్లా "స్వామిపుష్కరిణి" లో తేలాడు. నీటిలో నుంచి లేచిన అతడు, తన శరీరాన్ని తడిమి చూసుకుని ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పుళ్ళు మటుమాయ మయ్యాయి, శారీరక బాధ శాంతించింది. వెంగమాంబనూ, శ్రీనివాసుణ్ణి పరిపరి విధాలా, మనసులోనే కీర్తించాడు. అయితే, ఆ బ్రాహ్మణుడు ఎక్కువకాలం ఆ రహస్యాన్ని దాచలేక పోయాడు.


🌈 విప్రుని మరణం 🌈


💫 ఆ విప్రుడు కుష్టువ్యాధి గ్రస్తునిగా ఉన్నప్పడు చూసిన కొందరు భక్తులు, అతని వ్యాధి అత్యంత శీఘ్రంగా నయమవ్వటంలోని రహస్యాన్ని బహిర్గత పరచమని ఒత్తిడి చేయసాగారు. అతనిని సిద్ధపురుషుడిగా ప్రశంసించసాగారు. వారి పొగడ్తలకు ఉబ్బిపోయిన బ్రాహ్మణుడు తనకు గలిగిన భాగ్యాన్ని అందరికీ చాటిచెప్పాలనే అత్యుత్సాహంతో, వెంగమాంబ ఆనతిని అతిక్రమించి, అసలు విషయం అందరికీ చెప్పేశాడు. మెచ్చుకోలు మాటలకు మానవుడు ఎంతటికైనా తెగిస్తాడు మరి.


💫‌ మహా తపస్విని వెంగమాంబ శాపం ఊరికే పోతుందా? ఒక్క తృటిలో ఆ బాపని తల ముక్కచెక్కలై ప్రాణాలు వదిలాడు.


🌈 సమాధి నొందిన వెంగమాంబ 🌈


💫 విప్రుని అనాలోచిత ప్రవర్తనతో వెంగమాంబ ఉనికి బహిర్గతమైపోయింది. భక్తజనమందరూ తుంబురకోన బాట పట్టడంతో, అక్కడ కూడా వెంగమాంబకు ప్రశాంతత కరువైంది. 


💫 అలాంటి సమయంలో, ఒకనాటి రాత్రి ఆనందనిలయం చేరుకున్న వెంగమాంబ మరలా శ్రీవారితో మొర పెట్టుకుంది. అపరిమిత జన సంచారంతో తుంబురతీర్థం కూడా అలజడిగా ఉందనీ, తనను అక్కడ నుంచి కూడా తప్పించమని అనేక విధాలుగా ఆనందనిలయుణ్ణి వేడుకొంది. ఆమె మొరనాలకించిన శ్రీనివాసుడు వెంగమాంబతో,  "ఇక మీదట నిన్ను నానుంచి వేరుగా ఉంచటం భావ్యం కాదు. అందువల్ల నువ్వు తీవ్రమైన సమాధినిష్టలో ప్రవేశించు. ఆ సమాధి నుండే, ప్రతిరాత్రీ దివ్యతేజోరూపంతో ఆనందనిలయానికి వచ్చి నన్ను సేవించుకో" అని ఆనతిచ్చారు. 


💫 పరమానందం చెందిన వెంగమాంబ, శ్రీవారి ఆజ్ఞననుసరించి, తుంబురకోనను విడిచి, తిరిగి తిరుమల వీధుల్లో ప్రవేశించి, తనకు అంతిమ కాలమాసన్నమైందనీ, శ్రీవేంకటేశ్వరుడు తనను పిలుస్తున్నాడనీ, అందువల్ల సమాధిలో ఉంటూ సిద్ధి పొందుతాననీ అందరికీ తెలియ పరచింది. ఆ ప్రకారమే, 1817 సం. లో, సహస్రచంద్రదర్శనం (వెయ్యి పున్నమిలు – అంటే సుమారుగా 83 సంవత్సరాలు జీవించిన వారు సహస్రచంద్రదర్శనం చేసినట్లు భావిస్తారు) చేసిన ఆ వృద్ధ తపస్విని, ఈశ్వరనామ సంవత్సరం, శ్రావణ శుద్ధ నవమి నాడు సమాధిలో ప్రవేశించింది. అనంతరం, ఆమె ఆజ్ఞానుసారం, ఆ సమాధిని సుగంధ ద్రవ్యాలతో మూసివేసి, ఆ ప్రదేశంలో తులసీ బృందావనాన్ని ఏర్పాటు చేశారు.


🌈 వెంగమాంబ బృందావనం 🌈


💫 వెంగమాంబ బృందావనాన్ని నేటికీ మనం తిరుమలలో దర్శించుకోవచ్చు. ఆదివరాహస్వామి కాటేజీల వెనుక ఉన్న చిన్న రోడ్డులో, వెంగమాంబ జూనియర్ కాలేజీ ఆవరణలో ఆమె బృందావనం ఉంది. ఆ బృందావనంపై తొలిసారిగా అరణ్యమార్గంలో తిరుమల చేరుకున్నప్పుడు దారిలో ఆమెను రక్షించిన "సంతకాపు మొగిలిపెంట" ఆంజనేయస్వామి వారి చిన్న విగ్రహం కూడా ప్రతిష్ఠించబడింది.



🌈 నేటి తరిగొండ గ్రామం 🌈


💫 తరిగొండ గ్రామం నందలి తి.తి.దే. ఆధ్వర్యంలోని దేవాలయంలో ఆమె చిన్నప్పుడు పూజించిన ఆంజనేయస్వామి మరియు నృసింహస్వామి మూర్తులనూ ఇప్పటికీ చూడవచ్చు. స్థానికుల కథనం ప్రకారం, ఆంజనేయుడి విగ్రహం వెనుకనున్న ఓ బిలమార్గం ద్వారా ఆమె తిరుమలకు చేరుకుంది. దేవాలయంలో రాతిపలకలతో కప్పబడి వున్న ఆ బిలద్వారాన్ని, దేవాలయానికి సమీపంలో దేవతార్చన నీటి కోసం ఆమె ఉపయోగించిన దిగుడుబావిని కూడా నేడు చూడవచ్చు.


🌈 గ్రంథరచన 🌈


💫 ఆమె వ్రాసిన వేంకటాచలమహాత్మ్యం అనే గ్రంథం పారాయణ చేస్తే, పెళ్ళి కానివారికి సత్వరమే వివాహమవుతుందని ప్రతీతి. తిరుమల చరిత్రకు సంబంధించి, ఇప్పటికీ ఆ గ్రంథమే అత్యంత ప్రామాణికంగా భావింపబడుతుంది. సుమారు రెండువేల పద్యాలతో అలరారే ఈ గ్రంథప్రతులను వ్రాయసకాండ్రతో తయారు చేయించుకోవడం కోసం తిరుమల యాత్రికులు రోజుల తరబడి వేచి ఉండే వారంటే, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. తరువాత అనేక గ్రంథాలు వెలువడినా, ఆ గ్రంథ ప్రాశస్త్యం అలాగే కొనసాగుతోంది.


💫 ఆ సాహితీ సార్వభౌమురాలి కలం నుండి అష్టాంగరాజయోగం, ముక్తికాంతావిలాసం, గోపికానాటకం, జలక్రీడావిలాసం, వాశిష్ఠ రామాయణం, రుక్మిణీ కళ్యాణం, శ్రీకృష్ణమంజరి లాంటి గ్రంథాలు; అనేక నాటకాలు, ద్విపదలు, వేదాంతగ్రంథాలు, మరెన్నో వెలువడ్డాయి.


💫 ఆ తెలుగింటి ఆడబడుచు గురించి మనకు తెలిసింది చాలా తక్కువ!


💫 తరతరాలకూ తరగని తెలుగువారి పెన్నిధి తరిగొండ వెంగమాంబ, ప్రతి వేంకటేశ్వరుని భక్తునికీ ప్రాతఃస్మరణీయురాలు.


💫 మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రకు సంబంధించి తిరుమలలోనూ, తరిగొండలోనూ నేటికీ సజీవంగా ఉన్న ప్రతి జ్ఞాపికనూ దర్శించుకునే భాగ్యం కలగటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.


💫 స్వామివారి సపరిచర్యల్లోనూ, దాన-ధర్మ-సాహిత్య సాధనల్లోనూ అగ్రగామిగా వర్థిల్లిన ఆ ధన్యజీవి జీవితచరిత్ర సమాప్తం.

Share
Tarigonda Vengamamba Temple Tirumala TirumalaHills

No comments :

Please submit your suggestions, recommendations & queries

Translate

Popular Posts

  • image
    TTD Calendar 2022 - టీటీడీ క్యాలెండర్ 2022
    TTD Calendar 2022 Tirumala Tirupati Devasthanams Calendar Sri Balaji, Malayappa Swami, Tirupati Thimmappa Tirumala Tirupati Devasthanams Fes...
  • image
    TTD Eco Friendly initiative to sell incense Agarbathi Sticks
    TTD as part of Eco-friendly initiative to sell incense sticks made out of the used sacred garlands of TTD temples. Devotees of Sri Venkatesw...
  • image
    Vehicle Purchase dates with auspicious Muhurat timings
  • image
    Auspicious Dates for Property Registration
  • image
    Tirumala Accommodation
      https://tirupatibalaji.ap.gov.in/#/accommodationCal TTD has built cottages in Tirumala that can be rented by pilgrims. There are 3 categor...
  • image
    Jyeshtabhishekam, Tirumala
    Jyeshta maasa (May/June) is the third month of the traditional Hindu calender. The month gets the name after ‘Jyeshta’ star which falls on t...
  • image
    Hindu Marriage Calendar
  • image
    Tirumala Seva Details
    https://tirupatibalaji.ap.gov.in/#/sevaCal Advance Booking | Seva in Tirumala | Tirumala Daily Sevas Arjitha Seva  means performing seva to ...
  • image
    Tallapaka Annamacharya | తాళ్ళపాక అన్నమాచార్య 💕🙏
    🙏 *తాళ్ళపాక అన్నమాచార్యుడు* 🙏 *"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*  *వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"* ...
  • image
    Tirumala TTD Wedding Prasadam (Kalyana Talambralu)
    Special blessings for all newly weds from Lord Venkateswara. Blessings in return for your Wedding card. Akshintalu, Kumkamam,Kankanam, Ashir...

Loading...

TirumalaHills Archive

  • ▼  2022 (58)
    • ▼  June 19 - June 26 (30)
      • Tirumala Alipiri అలిపిరి మార్గం ❤💕
      • How to reach Tirumala by ✈️️🚂🚍🚘🚴👣🚶
      • Tirumala Srivari Vimana Pradakshinam - విమానప్రదక్...
      • Tallapaka Annamacharya | తాళ్ళపాక అన్నమాచార్య 💕🙏
      • Important Choultry Phone Numbers at Tirumala
      • Why Hathiramji Played LUDO with Sri Venkateshwara ...
      • How to send marriage invitation card to Tirumala? ...
      • How to Book Free Kalyana Vedika at Tirumala 👫💐 త...
      • Why Britishers Handover Tirumala Temple to Mahanth...
      • Srivari Kalyanam & Loan from Kuber
      • Tirumala Inside Temple Darshanam
      • Tirumala Sri Venkateshwara Swamy Moola Virat Darsh...
      • Tirumala Bangaru Vakili
      • Vimana Pradakshinam
      • Sri Padmavathi Srinivasa Parinayam Festival
      • Contribution of Bhagavad Ramanujacharya
      • Srivari Brahmotsavams
      • Vijayanagara Empire as Srivari Devotee
      • Srivari Varshikotsava / Annual Sevas
      • Tirumala Srivari Temple - A Religious & Spiritual ...
      • Tarigonda Vengamamba
      • Tirumala Paksha & Maasovastavam
      • Tirumala Sri Bhu Varaha Swamy Temple
      • Tirumala Srivari Devotee & History - Ananthalwar
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 1
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 2
      • Srivari Weekly Seva Varotsavalu - Volume 3
      • Srivari Bhakhagresarulu - Volume 3
      • Srivari Bhakhagresarulu - Volume 2
      • Srivari Bhakhagresarulu - Volume 1
    • ►  May 29 - June 5 (23)
    • ►  January 2 - January 9 (5)
  • ►  2021 (71)
    • ►  October 17 - October 24 (1)
    • ►  September 26 - October 3 (1)
    • ►  September 12 - September 19 (1)
    • ►  September 5 - September 12 (4)
    • ►  August 22 - August 29 (2)
    • ►  August 15 - August 22 (3)
    • ►  August 8 - August 15 (12)
    • ►  August 1 - August 8 (22)
    • ►  July 25 - August 1 (25)

Article Categories

TirumalaHills (126) Seva (22) Festivals (19) TTD (10) Visiting Places (10) Astrology (8) Muhuratham (8) Video (8) YouTube (8) SVBC (3) Accommodation (2) Darshanam (2) Photos (1)

Write your queries / suggestions

Name

Email *

Message *

Global Page Views

Translate

Search...

Popular Photos

  • image
    TTD Calendar 2022 - టీటీడీ క్యాలెండర్ 2022
  • image
    TTD Eco Friendly initiative to sell incense Agarbathi Sticks
  • image
    Vehicle Purchase dates with auspicious Muhurat timings
  • image
    Auspicious Dates for Property Registration
  • image
    Tirumala Accommodation
  • image
    Jyeshtabhishekam, Tirumala
  • image
    Hindu Marriage Calendar
  • image
    Tirumala Seva Details

Loading...

Play - Om Namo Venkatesaya

Facebook

ॐ TirumalaHills తిరుమలహిల్స్ तिरुमालाहिल्स ತಿರುಮಲಹಿಲ್ಸ್ திருமளாவுக்கு ॐ

Loading...
Powered by Blogger
All Right Reserved | Copyright © 2008-2021, TirumalaHills.org